![TTD Chairman](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-30-at-10.38.22-AM.jpeg)
TTD Chairman : ఆంధ్రప్రదేశ్ లో ఆధ్యాత్మికత ప్రదేశం తిరుమల. కలియుగ దైవం, శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. స్వామి పిలుపు ఎప్పుడు వస్తుందా తిరుమలకు ఎప్పుడు వెళ్తామా ఎదురు చూస్తుంటారు. అలాంటి తిరుమల పవిత్రతను జగన్ ప్రభుత్వం దిగజారే ప్రయత్నాలు చేసింది. అందుకే 11 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం హయాంలో స్వామి వారికి (చైర్మన్ గా) సేవ చేసుకునే భాగ్యం ఎవరికి దక్కుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఇద్దరికి దక్కవచ్చన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవికి కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు ముందున్నట్లు సమాచారం. అన్ని నామినేటెడ్ పదవుల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించబడే టీటీడీకి అధిపతిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం రాజ కుటుంబానికి చెందిన 72 ఏళ్ల వారసుడు అశోక్ గజపతి రాజు పట్ల ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది.
అశోక్ గజపతి రాజు రాజకీయ జీవితం..
అనుభవజ్ఞుడైన టీడీపీ నాయకుడు, విజయనగరం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2018లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. గజపతి రాజు అనారోగ్య కారణాల వల్ల 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు.
బీఆర్ నాయుడు..
బీఆర్ నాయుడు విషయానికి వస్తే, ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్ పదవి కమ్మవారికి ఇవ్వలేదు. అందువల్ల తొలిసారి ఆ పదవిని ఆ కులానికి ఇస్తే ఎవరూ అభ్యంతర పెట్టడానికి లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సారి బీసీలకు మంచి అవకాశాలు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అందువల్ల టీటీడీ చైర్మన్ పదవి కూడా బీసీలకే ఇస్తారనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.