June 1st 2023 : జూన్ ఒకటి నుంచి కఠిన నిబంధనలు రానున్నాయి. దీంతో మన జేబులు గుల్ల కావాల్సిందే. ఇప్పటికే ధరల పెరుగుదల అందరిలో ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు జూన్ 1 నుంచి నిబంధనల పేరుతో ప్రజలను దోచుకునేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనల వల్ల ఆర్థికంగా నష్టం కలిగే సూచనలున్నాయి.
ఆధార్ కార్డు, పెట్టుబడులు, ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఎలక్ర్టిక్ స్కూటర్ల సబ్సిడీలు, క్రిడిట్ కార్డు పేమెంట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి స్కీములతో ధరల పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ప్రతి నెల ఒకటో తేదీన ధరలు మారుతుంటాయి. జూన్ 1 నుంచి ఎలాంటి నిబంధనలు మారనున్నాయో తెలియడం లేదు. పెట్రో ధరల్లో కూడా మార్పులు వచ్చే సూచనలున్నాయి.
ఆధార్ కార్డు కలిగి ఉన్న వారు అందులో ఏవైనా లోపాలుంటే సరి చేసుకునేందుకు అవకాశం కలిగించనుంది. ఎలాంటి రుసుము చెల్లించుకోకుండా పేరు, అడ్రస్ వంటి వివరాలు నమోదు చేసుకునేందుకు చాన్స్ ఉంటుంది. జూన్ 14 వరకు ఈ అవకాశం ఉంటుంది. తరువాత ఆన్ లైన్ ద్వారా చేసే వాటికి రూ.50 చెల్లించాల్సి వస్తుంది.
ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ ధరలు సవరిస్తుంటారు. ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. స్థిరంగా ఉండవచ్చు. దీంతో వచ్చే నెలలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు. బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు, సేవింగ్, కరెంట్ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేసి క్లెయిమ్ చేసుకోని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి కోసం కుటుంబ సభ్యులకు, నామినీకి గానీ డబ్బులు అందించే చర్యలు తీసుకుంటోంది.
ఎలక్ర్టికల్ స్కూటర్, బైక్ లు కొనాలనుకునే వారికి జూన్ 1 నుంచి షాక్ తగలనుంది. కేంద్రం అందిస్తున్న సబ్సిడీలో భారీ కోత విధించనుంది. దీంతో గరిష్టంగా సబ్సిడీని పరిమితి 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఎలక్ర్టిక్ టూ వీలర్ వాహనాల ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ. 10 వేలకు తగ్గించింది.