Chandrababu Quash Petition :
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడాని సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పరిగణనలోకి తీసుకున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టిలతో కూడిన ధర్మాసనం దీనిని విచారించనుంది. అయితే రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే ఈ కేసు నమోదు చేశారని, రిమాండ్ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు లేవని చంద్రబాబు తరఫున న్యాయవాదులు పిటిషన్ లో పేర్కొన్నారు. 2018లో తీసుకొచ్చిన అవినీతి నిరోధక ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇక ఇదే అంశంపై అటు ఏపీ హైకోర్టులో కూడా విచారణ జరగనుంది. ఇందులో మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా ఉంది. మరి చంద్రబాబుకు ఊరట లభిస్తుందా వేచి చూడాల్సి ఉంది. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసంటూ సీఐడీ మరొకటి నమోదు చేసింది. దీనిలో కూడా బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తాజాగా యువనేత నారాలోకేశ్ ను ఏ14గా నమోదు చేశారు. మరోవైపు ఇటు ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరగనుంది. సుప్రీం కోర్టులో ఈ రోజు తర్వాత అక్టోబర్ 3 వరకు సెలవులు ఉన్నాయి. దీంతో ఈ రోజు జరిగే విచారణ పైనా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ReplyForward
|