IAS Transfers : తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్పులు చేర్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేపథ్యంలోని పలువురు ఐఏఎస్ అధికారులకు స్థానికలను కల్పించారు.
సీఎం ఓ సెక్రటరీగా జి. చంద్రశేఖర్ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీగా శరత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా డి.దివ్య, మహబూబాబాద్ కలెక్టర్ గా అద్వైత్ కుమార్ సింగ్, లేబర్ శాఖ డైరెక్టర్ గా కృష్ణా ఆదిత్య, మైనార్టీ రెసిడెన్షి యల్ ఇన్స్టిట్యూ షన్ సొసైటీ సెక్రటరీగా ఐషా మస్రత్ ఖానo, సంగారెడ్డి కలెక్టర్ గా వల్లూరు క్రాంతి, జోగులాంబ కలెక్టర్ గా సంతోష్ లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమకు నచ్చిన అధికారులను మార్చుకోవడం సర్వసాధారణం.. పరిపాలనకు అనుకూలంగా తాము అనుకున్నది జరగాలంటే అనుకూల మైనటువంటి అధికారులు ఉండాలని ప్రభుత్వం అనుకుంటుంది ఈ క్రమంలోని ఐఏఎస్ అధికారుల మార్పుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది మొత్తం మీద శాఖలు కేటాయించిన అధికారులు బాధ్యతలు తీసుకోనున్నారు.