Tirumala : తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 24,25 తేదీల్లో ఘనంగా జరగనుంది. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా తుంబూరు తీర్థానికి మార్చే 24వ తేదీ ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మళ్లీ మరుసటి రోజు అయినా మార్చి 25వ తేదీన ఉదయం ఐదు నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతిస్తారు.
పాప వినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం అన్న ప్రసాదాలు త్రాగునీరు అందజేస్తారు. ప్రధమ చికిత్స కేంద్రాలు అంబులెన్సులు మందులు పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు. తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సింది వస్తుంది కావున గుండె, శ్వాసకోశ సమస్యలు స్థూలకాయ ఉన్నవారికి అనుమతి లేదన్నారు. భక్తులు వంట సామాగ్రి, కర్పూరం అగ్గిపెట్టెలు, తీసుకురాకూ డదని టిటిడి విజ్ఞప్తి చేస్తుంది.
పోలీసు శాఖ అటవీశాఖ టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయం తో పాప వినాశనం నుండి తుంబు రు తీర్థం వరకు అక్కడక్కడ భద్రత సిబ్బందిని ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు .
ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు తుంబురు తీర్థం ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పర్వదినాన తీర్థ స్నానం ఆచరించి దానధర్మాలు చేసిన స్వామి వారిని భక్తుల దర్శించుకుంటారు ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థంము క్కోటిని దర్శించి స్నానం ఆచరిం చడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు .ఈ ముక్కోటిలో టిటిడి అధికారులు, అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.