Pawan Kalyan Victory : పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కల్యాణ్ గెలుపు దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది. పిఠాపురంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన స్థానిక నేత వర్మ దాదాపు లక్ష ఓట్లు సాధించారు. 2019 లో టీడీపీ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే పిఠాపురంలో 2019 లో వర్మ ఓడిపోవడానికి కారణం జనసేన అభ్యర్థి ఓట్లు చీల్చడమే.
అయినా వర్మ చంద్రబాబు మాటను గౌరవించి కూటమిలో భాగంగా పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలబడ్డాడు. తన సీటును త్యాగం చేసి పవన్ కోసం ప్రచారం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గెలుపు ఖాయమనే అభిప్రాయానికి వచ్చేశారు. వైసీపీ అభ్యర్థి వంగ గీత తరఫున పోలింగ్ బూత్ ల్లో కనీసం ఎజెంట్లు కూడా లేరని దీంతోనే పవన్ గెలుపు ఖాయమైనట్లు ప్రచారం చేసుకుంటున్నారు.
పోలింగ్ బూత్ ల వద్దకు వెళ్లిన వంగ గీతకు చుక్కెదురైంది. ఓ పెద్దాయన ఆమెను ప్రశ్నించాడు. ఇక్కడికి వచ్చి ఓటు గుర్తుంది కదా వేయమని ప్రచారం చేయడం ఎంటని ప్రశ్నించారు. దీనికి ఆమె నమస్కారం పెట్టకూడదా అంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. వంగ గీత ఓటమి దాదాపు ఒప్పుకున్నట్లే అని టీడీపీ, జనసేన వర్గాలు ముక్త కంఠంతో చెబుతున్నాయి.
పిఠాపురంలో వర్మ జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలను కలుపుకుని పోయి నియోజకవర్గం మొత్తం ప్రచారం నిర్వహించారు. ఇలా చేయడం వల్ల వారికి నమ్మకం కుదిరింది. టీడీపీ ఓట్లు కూడా ఎక్కడా చీలిపోలేవని ఈ సారి జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్ కే ఆ ఓట్లు అన్ని పడ్డాయని నిర్దారణకు వచ్చారు. ఇలాంటి సమయంలో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన పవన్ మొదటి సారి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమనే చర్చ నడుస్తోంది. జూన్ 4న కౌంటింగ్ రోజున పవన్ కల్యాణ్ చాలెంజ్ నెగ్గి అసెంబ్లీలో అడుగుపెడతాడా లేదా చూడాలి.