![Venuswamy](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-13-3.jpg)
Venuswamy : అంతన్నాడు ఇంతన్నాడే మా ఏణుస్వామి.. చివరకు ముంతమామిడి పండు అన్నాడే అని తెగ ఏసేసుకుంటున్నారు జనాలు.. వన్డే వరల్డ్ కప్ లో ఇండియా గెలుస్తుందని చెప్పాడు.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ విజయం సాధిస్తారని అన్నాడు. అంతేకాదు ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు దక్కించుకుంటుందని ప్రకటించాడు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని స్పష్టం చేశాడు. ఇవేవీ జరగలేదు.
పైగా అతను చెప్పిన తర్వాత ఆ వ్యక్తులు, ఆ జట్లు అడ్డగోలుగా బోల్తాపడ్డాయి. ఫలితంగా వేణు స్వామి చరిష్మా తగ్గింది. అతడి క్రేజ్ పడిపోయింది. స్థూలంగా చూస్తే అతడు మామూలు మనిషి అని తేలిపోయింది. వేణుస్వామి చెప్పిన జోస్యాలన్నీ అడ్డంగా తిరగబడడంతో సోషల్ మీడియాలో నెటిజెన్లు ఏకిపారేయడం మొదలుపెట్టారు..
View this post on Instagram