Virat Kohli : అసియాకప్ సమరానికి టీమిండియా సిద్ధమవుతున్నది. మరో ఐదు జట్టు కూడా ఈ టోర్నీలో పాల్గొనబోతున్నాయి. ఆగస్టు 30 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కాబోతున్నది. ఇప్పటికే జట్టును టీమిండియా మేనేజ్ మెంట్ ప్రకటించింది. అయితే ఈసారి గ్రూప్ ఏలో ఉన్న రెండు జట్ల పైనే అందరి దృష్టి ఉంది. అవే దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లపైనే అందరి దృష్టి ఉంది. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తు్న్న భారత్, పాక్ తొలిమ్యాచ్ సెప్టెంబర్ 2న జరగబోతున్నది.
అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వికెట్ పైనే పాక్ కు చెందిన ఓ ప్రధాన బౌలర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది. ఎందుకంటే గతంలో పరాభావం పొందిన ఆ బౌలర్ ఇప్పుడు ప్రతీకారానికి సిద్ధమవుతున్నాడు. గత టీ 20 సిరీస్ లో పాక్ తో మ్యాచ్ ను విరాట్ కోహ్లీ ఒంటిచేత్తో గెలిపించాడు. పాక్ బౌలర్ రవూఫ్ ఓవర్లో నే విరాట్ విజృంభించాడు. ఇదే ఇప్పుడు ఆయన ప్రతీకారానికి కారణం. ఎలాగైనా ఈసారి విరాట్ వికెట్ తీయాలని రవూఫ్ తహతహలాడుతున్నాడు.
టీ20 ప్రపంచకప్ 2022 సందర్భంగా సూపర్ 8 మ్యాచ్ లో పాక్ ముందుగా బ్యాటింగ్ చేసి 150 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బరిలోకి దిగిన విరాట్, హార్దిక్ పాండ్యాతో కలిసి టీమిండియాను గెలిపించాడు. ఈ మ్యాచ్లో చివరి రెండు ఓవర్లలో భారత్ 31 పరుగులు చేయాల్సి ఉంది. 19 వ ఓవర్ వేయడానికి హరీస్ రవూఫ్ వచ్చాడు. మొదటి నాలుగు బంతులకు కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ఆఖరి రెండు బంతుల్లో రెండు సిక్స్ లు కొట్టిన కోహ్లీ, తర్వాత ఓవర్లో కూడా రెచ్చిపోయి ఆడాడు. అయితే తన బౌలింగ్ లో రెండు సిక్స్ లే పాక్ ఓడిపోవడానికి కారణమని రవూఫ్ భావిస్తున్నాడు. దీనికి ప్రతీకారంగా ఆసియా కప్ లో విరాట్ వికెట్ తీయాలని తహతలాడుతున్నాడు.
అయితే ఆసియా కప్ లో భారత్ రెండుసార్లు పాక్ తో ఆడబోతున్నది. అయితే ఇరు జట్లు ఫైనల్ కు వెళ్తే మూడోసారి కూడా తలపడనున్నాయి. మరి విరాట్ మళ్లీ దంచి కొడుతాడా.. రవూఫ్ బౌలింగ్ తో విరుచుకుపడుతాడా.. అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరో వారం రోజుల్లో ఆసియా కప్ సమరం ప్రారంభం కాబోతున్నది. ఇప్పటికే ఇరు జట్లు నెట్ ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నాయి. ఇంకేం అభిమానులకు పండుగే మరి.