Lord Shiva Run : పూర్వం వృకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు అమాయకులను వేధిస్తుండేవాడు. చిన్న చిన్న దేవుళ్లను కాకుడా శివుడిని ఏడిపించాలని అనుకున్నాడు. ఇందులో భాగంగా శివుడిని ప్రత్యక్షం చేసుకోవాలని తపస్సు చేయాలని భావించాడు. శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. అయినా మహాశివుడు ప్రత్యక్షం కాకపోవడంతో తన ఒంటిపై ఉన్న మాంసాన్ని కోసుకుంటూ హోమగుండంలో వేయసాగాడు. అతడి పట్టుదల పెరిగింది. తన తలనే నరికి హోమగుండంలో వేసేందుకు సిద్ధపడ్డాడు.
దీంతో పరమశివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అంటాడు. నువ్వు కనిపించావు దేవా నాకు వరం అక్కర్లేదంటే నీకు అసవసమయ్యే ఏదైనా కోరుకో అన్నప్పుడు నేను ఎవరి నెత్తిమీద చెయ్యి పెడితే వారు భస్మం కావాలని కోరుకుంటాడు. ఇదేమిటి పిచ్చి కోరిక అని ఆశ్చర్యపోతాడు. కానీ చివరకు సరే అని వరం ఇస్తాడు. దీంతో ఆ రాక్షసుడు దేవా నువ్వు వరం ఇచ్చావు కదా అది పని చేస్తుందో లేదో నీమీదే చెయ్యి పెట్టి పరిశీలించుకుంటా అనడంతో శివుడు పరుగు పెడతాడు.
విషయం నారదుడికి తెలియడంతో మహావిష్ణువు వద్దకు వెళ్లి శివుడిని కాపాడాలని కోరతాడు. అప్పుడు విష్ణువు బాలబ్రహ్మచారి వేషం వేసుకుని ఆ రాక్షసుడు వస్తున్న దారిలో నిలిచాడు. అప్పుడు ఆ రాక్షసుడు శివుడు ఇటుగా వెళ్లడం చూశావా? అని అడిగాడు. పరుగున వెళ్లి ఆ కొండల మాటుగా పరుగు తీశాడని చెప్పాడు. విషయం తెలుసుకున్న విష్ణువు ఆ రాక్షసుడికి ఓ విషయం బోధించాడు.
నువ్వు శివుడిని తాకాలంటే శుచి, శుభ్రంగా ఉండాలి. నువ్వు శివుడిని తాకాలంటే నదిలో స్నానం చేసి పవిత్రంగా రావాలని సూచించాడు. దీంతో రాక్షసుడు నదిలో దిగి స్నానం చేసుకుంటూ నెత్తి మీద చెయ్యి పెట్టుకుని తనకు తానే బస్మమై పోతాడు. ఎవడి కోరిక వాడినే నాశనం చేస్తుందనడానికి ఇదే నిదర్శనం. అతడి తల వేయి వక్కలై చచ్చాడు.