కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయాల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయాలు శివనామ స్మరణతో మారిపోతున్నాయి. పలుచోట్ల భక్తులు నదుల్లో పుణ్య స్నానాలు ఆచరించి కార్తిక దీపారాధన చేశారు. భద్రాచలం, రాజమహేంద్రవరం, గోదావరి, విజయవాడ లో కృష్ణా నదుల్లో చేశారు.. శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, తదితర ప్రాంతాల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.
Breaking News