Ksheera Sagara Madanam : పురాణాల్లో క్షీరసాగర మథనం గురించి మనకు తెలిసిందే. సముద్రాన్ని చిలకడానికి దేవతలు ఒకవైపు, రాక్షసులు మరో వైపు ఉండి చిలికారు. అందులో నుంచి వచ్చిన అమృతాన్ని తాగాలని అనుకున్నారు. చివరకు అమృతం బయటకు రావడంతో దాన్ని తాగడానికి అందరు సిద్ధమయ్యారు. రాక్షసులు సైతం అమృతాన్ని దక్కించుకోవాలని ఆశపడ్డారు. కానీ దేవతలే అమృతాన్ని సొంతం చేసుకున్నారు.
మొదట సముద్రం నుంచి విషయం బయటకు వచ్చింది. దీంతో అందరు భయపడ్డారు. ఆ విషం శివుడు మింగేందుకు ముందుకొచ్చాడు. దాన్ని మింగి గరళకంఠుడు అయ్యాడు. ఇలా క్షీర సాగర మథనంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. దేవతలు అమృతం తాగుతుంటే మధ్యలో రాహువు, కేతువు అనే రాక్షసులు కలుస్తారు. ఈ విషయం తెలుసుకున్న విష్ణువు వారి తలలు ఖండిస్తాడు. వారి నోట్లో అమృతం ఉండటంతో వారు ప్రతి ఏడాది చంద్రున్ని మింగుతారని ప్రతీతి.
ఇక గజేంద్రమోక్షంలో గజేంద్రుడు విష్ణువును ధ్యానిస్తుంది. దాంతో సాక్షాత్తు శ్రీమహావిష్ణువే స్వయంగా వచ్చి మొసలిని సంహరిస్తాడు. ఇలా పురాణాల్లో వీటికి ప్రత్యేకత ఉంది. దేవతల అనుగ్రహంతోనే అన్ని సాధ్యమవుతాయి. ఇలా పురాణాల ప్రకారం క్షీర సాగర మథనం, గజేంద్ర మోక్షం పురాణాలు మన వారికి ఎంతో ఇష్టమైనవిగా ఉంటాయి.
క్షీర సాగర మథనంలో కామధేనువు, లక్ష్మీదేవి వంటి వారు రావడంతో లక్ష్మీదేవి తనకు కావాలని ఇంద్రుడు ఆశించినా లక్ష్మీదేవి మాత్రం విష్ణువును వరిస్తుంది. ఈ నేపథ్యంలో అందులో నుంచి వెలువడిన వాటి వల్ల ఎన్నో విలువైనవి వచ్చాయి. ఇలా క్షీర సాగర మథనం ఓ మ్యాజిక్ లా కనిపిస్తుంది. అయినా అందులో జరిగిన మహత్తర విషయాలు మనకు ఆసక్తి గొలుపుతాయి.