Always Worship God : మనకు ఎప్పుడు ఓ అనుమానం వస్తుంది. మంచి భక్తి శ్రద్ధలతో దేవుడిని కొలిచే వాడికి కష్టాలు వస్తాయి. దేవుడిని పూజించని వాడికి మాత్రం సిరిసంపదలు వస్తాయి. దీంతో ఒకానొక సమయంలో భక భక్తుడు మహావిష్ణువును అడుగుతాడు. స్వామి మాకు కష్టాలు ఎందుకు ఇస్తావు? సుఖాలు మాత్రం ఎలాంటి పూజలు చేయని వాడికి ఇస్తున్నావని అడిగితే దానికి ఆయన చెప్పే సమాధానం విని ఆశ్చర్యపోతాడు.
ఇదే ప్రశ్న ఓసారి నారదుడికి కూడా వచ్చింది. దీంతో అతడు కూడా ఇలాగే అడుగుతాడు. దానికి మహావిష్ణువు నారదుడితో ఇలా చెబుతాడు. సామాన్య మానవుల అవతారంలో భూలోకంలోకి వెళ్లి వస్తామని అంటాడు. దానికి నారదుడు కూడా సరే అంటాడు. వారిద్దరు బ్రాహ్మణ దుస్తులు ధరించి భూలోకానికి వచ్చే సందర్భంలో ఓ భవనం చూస్తారు. అక్కడకు వెళ్లి ఆకలేస్తుంది ఏదైనా తినడానికి పెట్టాలని అడిగితే వారు కసురుకోవడంతో మీకు బాగా డబ్బు రావాలని దీవించి వెళతారు.
మళ్లీ ఓ గుడిసె వద్దకు వెళ్లి తినడానికి ఏమైనా పెట్టాలని అడిగితే మా ఇంట్లో ఏమీ లేవు. కానీ మాకు ఉన్న ఆవు ఇచ్చే పాలు మాత్రమే ఉన్నాయని ఇంట్లోకి రావాలని చెబుతుంది. వారికి పాలు పోస్తుంది. పాలు తాగిన మహావిష్ణువు నీ ఆవు త్వరలో చనిపోతుందని దీవించి వస్తాడు. అప్పుడు నారదుడు మళ్లీ ప్రశ్నిస్తాడు. అతడు ఏం పెట్టకపోతే లక్ష్మీదేవి రావాలని దీవించారు. ఈమె కడుపునిండా పాలు పోస్తే తన ఆవు చనిపోవాలని దీవించడమేమిటి స్వామి అంటాడు.
అప్పుడు మహా విష్ణువు చెబుతూ డబ్బు మీద యావ ఉన్న వాడు నరకానికి వెళతాడు. డబ్బు మీద మమకారం లేనివారు స్వర్గానికి వెళతారు. ఇక ఆమె తనకంటే ముందే ఆవు చనిపోతే ఆవు మీద ఇష్టంతో నరకానికి వెళ్తుంది. దీంతో ఆమెకు స్వర్గలోకానికి చేరుకోవడం కష్టం అవుతుంది. అందుకే అతడికి డబ్బు రావాలని, ఆమెకు ఆవు చనిపోవాలని దీవించినట్లు చెబుతాడు.