Team India : టీమిండియా వరుస వైఫల్యాలతో అభిమానులకు నిరాశ మిగులుస్తున్నది. ప్రపంకప్ కు ముందట ఇది టీమ్ మేనేజ్ మెంట్ ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ప్రధాన ఆటగాళ్లు ఫామ్ లో లేకపోవడం, గాయాలు, తదితర సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఐదు ప్రధానాంశాల్లో టీమిండియా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఇందులో ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్, పేస్ బౌలింగ్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫామ్ లో లేకపోవడం ప్రధానంగా ఉంది.
ఈ నెల ఆఖరు నుంచి టీమిండియా ఆసియా కప్ లో ఆడబోతున్నది. దీని తర్వాతే ప్రపంచకప్ ఉండబోతున్నది. అయితే పాకిస్థాన్తో ఆసియాకప్ లో భారతజట్టు ఆడబోతున్నది. ప్రస్తుతం ‘ భారత జట్టు ఫామ్ పైనే అందరి సందేహాలు నెలకొన్నాయి. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్. శార్దూల్ ఠాకూర్ కొంత రాణిస్తున్నా. వీరికి మిగతా బౌలర్ల నుంచి సహకారం అందాల్సి ఉంది. జట్టు సమస్యలపై ఇప్పటికే రోహిత్ శర్మతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్ సమాలోచనలు చేస్తున్నారు. ఆసియా కప్ లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, నేపాల్ ఉండగా, గ్రూప్ బీలో శ్రీలంక, బంగ్లాదేశ్. ఆఫ్గానిస్థాన్ ఉన్నాయి.
అయితే ఈసారి టీమిండియా ఫామ్ జట్టు మేనేజ్మెంట్ ను ఇబ్బంది పెడుతున్నది. యువ ఆటగాళ్లెవరూ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఇప్పుడు సమస్యగా మారింది. ప్రపంచకప్ సన్నాహకంగా ఉంటుందనుకుంటున్న ఆసియాకప్ లో జట్టు ఓడిపోతే మరింత ఇబ్బందికర ‘ పరిస్థితి తలెత్తుతుంది. దీంతో అభిమానుల్లో నిరాశ పెరుగుతుంది. జట్టు మానసిక స్థైర్యం కూడా దెబ్బతింటుంది. హార్డిక్ పాండ్యా. శ్రేయాస్ అయ్యర్, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్. కేఎల్ రాహుల్, సంజూ శ్యాంసన్ తదితర ఆటగాళ్లు మరింతగా రాణిస్తే తప్పా. జట్టు గెలవలేదు. ఏదేమైనా ప్రతిసారి ఎవరో ఒకరు ఆడితేనే జట్టు అరకొరగా గెలుస్తూ వస్తున్నది. సమష్టి పోరాటం కోసం భారత అభిమానులు ఎదురు చూస్తున్నారు. రోహిత్. విరాట్ కోహ్లి లాంటి సీనియర్లకు యువ ఆటగాళ్లు తోడైతే టీమిండియా విజయం ఖాయం.