Yellow media : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు ప్రచారం కల్పించేందుకు ఎల్లో మీడియా సన్నద్ధమవుతున్నది. కేవలం టీడీపీకి రాజకీయంగా బలం చేకూర్చేందుకు మాత్రమే పవన్కల్యాణ్ యాత్రను కవర్ చేయాలని భావిస్తున్నది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం నుంచి బుధవారం వారాహి యాత్రకు జనసేనాని పవన్కల్యాణ్ శ్రీకారం చుడుతున్నారు. అయితే టీడీపీకి ప్రచారం కల్పించే ఎల్లో మీడియా పవన్ కు కూడా ఈసారి అదేస్థాయిలో ప్రచారం కల్పించేందుకు సిద్ధమవుతున్నది. టీడీపీతో కలిసి నడుస్తున్నారనే ఏకైక కారణంతో కొంత అయిష్టంగానే ఈ ప్రచారం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. మంగళవారం అన్నవరం చేరుకునేందుకు పవన్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి అన్నవరంలో జనసేన పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న గోదావరి జిల్లాల్లో వారాహి ప్రచారం సాగనుంది. జగన్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పవన్ ప్రచారం నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా వారాహి యాత్రకు మెజార్టీ ప్రచారం కల్పించాలని ఎల్లో మీడియా భావిస్తు్న్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని పవన్ పదే పదే చెబుతున్నారు. ఇందులో భాగంగా రెండు సార్లు టీడీపీ అధినేత చంద్రబాబుతో రెండు సార్లు పవన్ భేటీ అయ్యారు. పొత్తులపై నిశితంగా చర్చించారు. పార్టీ గౌరవానికి భంగం కలుగకుండా పొత్తు ఉంటుందని, సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని పవన్ పదే పదే శ్రేణులను కోరుతున్నారు.
ఇక టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని తేలింది. అయితే సీట్ల విషయంలోనే ఇప్పుడు చర్చంతా. అయితే పవన్ కల్యాణ్ మాత్రం పొత్తు గౌరవంగానే ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఈ అంశంపై టీడీపీ, జనసేన అధినేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా టాక్ వినిపించింది. దీంతోనే ఈసారి పవన్ నిర్వహించే వారాహి యాత్రకు ప్రచారం పెద్ద ఎత్తున కల్పించిన చంద్రబాబు ఎల్లో మీడియాకు చెప్పినట్లు సమాచారం. లోకేశ్ పాదయాత్రకు ఇస్తున్న ప్రచారాన్ని కొనసాగిస్తూనే, దానిని డామినేట్ చేయకుండా పవన్కు ప్రచారం కల్పించాలని ఎల్లో మీడియా భావిస్తోంది.
అయితే జనసేనాని యాత్రలో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొంటాయా. .లేదంటే జనసేన శ్రేణులకు మాత్రమేనా అనేది తేలాల్సి ఉంది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పొత్తులపై ఎవరూ వ్యాఖ్యలు చేయొద్దని పవన్ ఇప్పటికే సూచించారు. మరి రానున్న రోజుల్లో సీట్ల అంశం ఎలా తేలనుందో చూడాలి. ఇటు ఎల్లో మీడియా మాత్రం రెండు పార్టీలకు గట్టి సపోర్ట్ ఇచ్చి, జగన్ ను డమ్మి చేసే ప్రయత్నాలను కొనసాగించాలని భావిస్తున్నది.