ఆచార్య చాణక్యుడు డబ్బు సంపాదించే క్రమంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాడు. మనిషి తన జీవితంలో డబ్బు ప్రదాన వనరుగా ఉంటుంది. మనం జీవించడానికి డబ్బే ప్రధానం. డబ్బు లేకపోతే వాడిని హీనంగా చూస్తారు. వాడికి సమాజంలో విలువ ఉండదు. అందుకే జీవితంలో డబ్బు సంపాదించి తన స్థానాన్ని చూపించాలి. అప్పుడే తన ప్రస్థానం బాగుంటుంది.
లక్ష్మీదేవి చంచల స్వభాగం కలిగి ఉంటుంది. అందుకే ఆమె ఒక చోట నిలవదు. అందుకే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంపాదించే క్రమంలో అడ్డదారులు తొక్కకూడదు. నీతి నిజాయితీతో సంపాదిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోనే నివాసం ఉంటుంది. అక్రమాల ద్వారా సంపాదిస్తే నష్టపోవడం ఖాయం.
డబ్బు ఎప్పుడు కూడా ఇతరులను మోసం చేసి సంపాదించకూడదు. నీతిగానే సంపాదించాలి. అబద్ధాలు ఆడి మోసం చేస్తే ఆ డబ్బు ఉండదు. ఆగాన వచ్చింది భోగాన పోతుందని చెబుతారు. అందుకే డబ్బు సంపాదనలో మంచి మార్గాలనే అనుసరించాలి. దీని కోసం మన గుణం మార్చుకోకూడదు. డబ్బు సంపాదించి మన అవసరాలు తీర్చుకోవాలి.
అబద్దాలతో ధనం సంపాదిస్తే అది మన వెంట నిలవదు. కష్టపడి సంపాదించే వాడికే కష్టం విలువ తెలుస్తుంది. డబ్బును కొంత వరకు దాన ధర్మాలకు కూడా వినియోగించాలి. అప్పుడే చల్లిన చెలిమే ఊరుతుంది అన్నట్లు డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా డబ్బు సంపాదనలో చాణక్యుడు ఎన్నో విషయాలు వివరించాడు.