Vastu Tips : ‘ధనం మూలం ఇదం జగత్’ అంటారు. ధనం ఉంటే అన్ని, అందరూ కాళ్ల వద్దకు వస్తారు. ధనం లేకపోతే కనీసం రక్త సంబంధీకులే పట్టించుకోరు. అలాంటి ధనం ఇంట్లో నిలువకపోతే కష్టాలు వచ్చి పడుతున్నట్లే.. ధనం ఇంట్లో నిలవాలంటే టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ థెరపిస్ట్ ప్రకారం పరిష్కారం చూసుకోవాలి. ఈ పరిహారం చేస్తే లక్ష్మి రాక పెరగడమే కాదు.. ఇంట్లో డబ్బు నిల్వ కూడా ఉంటుంది. ఇంట్లోనే ఈ పరిష్కారాన్ని సులభంగా చేయవచ్చు. ఈ పరిహారం చేసేందుకు పెద్దగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ థెరపిస్ట్ సిద్ధి బరోల్ కొన్ని సూచనలు చేస్తున్నారు. డబ్బు మీ ఇంట్లోకి రాకపోయినా.. లక్ష్మి నిల్వకపోయినా.. పరిష్కారం తీసుకోవాలి. మెయిన్ డోర్ ఇరువైపులా పసుపు చల్లాలి. ఉదయం స్నానం చేసిన తర్వాత 21 రోజుల పాటు ఈ పరిహారం చేయాలి. దీని వల్ల లక్ష్మి రాక పెరుగుతుంది. వ్యాపారం కూడా కలిసి వస్తుంది.
పసుపును మెత్తగా చేసుకొని పొడిని మాత్రమే చల్లుకోవాలి. ఇలా చేస్తూ లక్ష్మి కటాక్షం సిద్ధించాలి.. లక్ష్మి నిలవాలి అని మనసులో ధ్యానం చేసుకోవాలి. దీంతో ధనం మీ ఇంటికి వచ్చి నిల్వ ఉంటుంది.
మీరు ₹50 విలువైన పసుపును కొనుగోలు చేస్తే, 21 రోజుల పాటు ఈ పరిహారం చేయవచ్చు. ఈ పరిహారం చేసేందుకు కేవలం ₹50 మాత్రమే ఖర్చు చేయాలి. మీరు స్నానం చేసిన తర్వాత మాత్రమే పరిహారం చేయాలనే నియమాన్ని పాటించాలి. ఈ రెమెడీ తర్వాత, మీ ఇంటి ముందు ఉన్న పసుపును సేకరించి చెట్లల్లో వేయాలి.