Modi: భారత్ లో త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి నాయకులు క్రమంగా అమెరికా బాట పడుతున్నారు. ఇక్కడి ఎన్నికలకు, అక్కడికి నేతలు వెళ్లేందుకు లింకు ఏంటి అనుకుంటున్నారా..? అయితే ఎక్కువ మంది భారతీయులు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఉద్యోగాలు, చదువులు ఇలా వివిధ పనులపై వెళ్లిన వారు కొందరు స్థిరపడ్డారు. మరికొందరు వెళ్తూ వస్తున్నారు. అయితే ఇతర దేశాల్లో కంటే ఇక్కడ యూఎస్ లో ఉన్న భారతీయుల సంఖ్య ఎక్కువ. అయితే భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వాటిపై వారి ప్రభావం ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది.
కొన్ని రోజుల ముందు పీసీసీ కార్యదర్శి రాహుల్ గాంధీ అమెరికాలో విస్తృతంగా పర్యటించారు. అక్కడి ఎన్ఆర్ఐలతో సమావేశాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావాలంటే తీసుకోవాల్సిన చర్యలపై అక్కడి వారితో సమావేశాలు నిర్వహించారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఇండియాలో ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతివ్వాలని అక్కడి ప్రముఖులను కోరారు. అమెరికాలోని కొన్ని చోట్ల నిర్వహించిన విందులో కూడా ఆయన పాల్గొన్నారు. దీంతో ఆయన పర్యటన కొంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం (జూన్ 18వ తేదీ) అమెరికా పర్యటన చేయబోతున్నారు. ప్రవాస భారతీయులతో మోడీ విస్తృతంగా పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘యునిటీ మార్చ్’ కూడా నిర్వహిస్తున్నారు. దీని కోసం యూఎస్ బీజేపీ ఫాలోవర్స్ తో పాటు బీజేపీ పార్టీ అభిమానులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మోడీ ప్రధాని హోదాలో చాలా సార్లు అమెరికా పర్యటనకు వెళ్లారు. గతంలో ‘హౌడీ మోడీ’కి వరల్డ్ వైడ్ గా ప్రాచుర్యం దక్కింది. కానీ ఇప్పుడు భారత్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని పర్యటన ప్రాచుర్యం దక్కించుకుంది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ‘యునిటీ మార్చ్’ను న్యూయార్క్ లో ఆదివారం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మార్చ్ ప్రారంభం కానుంది. టైమ్ స్క్వేర్, మన్హాటన్, న్యూ యార్క్-10036లో కార్యక్రమం ప్రారంభించనున్నారు.