మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాల కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు , ఎండీ శైలజా కిరణ్ లను విచారిస్తున్నారు. శైలజా కిరణ్ స్వగృహంలో ఈ విచారణ సాగుతోంది. చెరుకూరి రామోజీరావు కూడా ఈ విచారణకు హాజరయ్యాడు. చిట్ ఫండ్ చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో నిధులు మళ్లించడంపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఈ కేసులో రామోజీరావు ఏ 1 గా ఉండగా ఏ 2 గా శైలజా కిరణ్ ఉన్నారు దాంతో ఆ ఇద్దరినీ ఏపీ సీఐడీ వాళ్ళ ఇంట్లోనే విచారిస్తోంది. మార్గదర్శి చిట్ ఫండ్ లలో ప్రజలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. కాగా ఆ సొమ్మును మ్యూచ్ వల్ ఫండ్స్ లో అలాగే షేర్ మార్కెట్ లలో పెట్టుబడులుగా పెడుతున్నారు మార్గదర్శి నిర్వాహకులు. ఆర్బీఐ చట్టం ప్రకారం ఇలా చిట్ ఫండ్ డబ్బులను దారి మళ్లించడం తీవ్ర నేరం. దాంతో ఏపీ సీఐడీ విచారణ చేస్తోంది.