mohanbabu మంచు కుటుంబానికి సినిమా ఇండస్ర్టీలో ఒక రేంజ్ పేరుంది. మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్, ఇక లక్ష్మి అందరూ సినిమాల్లో నటించారు. మోహన్ బాబు ఇండస్ర్టీలో తనదైన రీతిలో నటించి పేరు సంపాదించుకోగా, ఇక ఆ స్థాయి ఆయన పిల్లలు చేరుకోలేకపోయారు. అయితే ఈ కుటుంబం విద్యానికేతన్ పేరిట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నది. కాగా, గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా మోహన్ బాబు పనిచేశారు. ఆ తర్వాత కారణాలెంటో తెలియదు కాని ఆయన టీడీపీ కి దూరమయ్యారు. చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ ఇటీవల వెళ్లి ఒకసారి రహస్యంగా చంద్రబాబును కలిశారని టాక్ బయటకు వచ్చింది. ప్రస్తుతానికైతే ఆయన వైసీపీలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.
అయితే మోహన్ బాబు కూతురు లక్ష్మి పూర్తిస్థాయిలో రాజకీయాలకు దూరంగానే ఉంటారు. ఆమె తన కార్యక్రమాలతో ప్రత్యేకంగా అలరిస్తుంటారు. ఇక విష్ణు వైఎస్ కుటుంబానికి చెందిన అమ్మాయిని పెండ్లి చేసుకున్నారు. ఆయన మా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన సినిమాలు, విద్యాసంస్థలు చూసుకుంటూ బిజీగా ఉన్నారు.
ఇక మంచు మనోజ్ ఇటీవల రెండో వివాహం చేసుకున్నారు. రాజకీయ ఫ్యామిలీ అయిన దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల రెండో కూతురు మౌనికారెడ్డి ని వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహం. అయితే ఇద్దరి వివాహం కుటుంబంలో కొంత గ్యాప్ పెంచిందనే వార్తలు వచ్చాయి. విష్ణు, మనోజ్ మధ్య ఇటీవల జరిగిన గొడవ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అయితే సోమవారం మంచు మనోజ్, మౌనికారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు ను కలిశారు. అయితే మౌనికారెడ్డి గతంలో టీడీపీ తరఫున పనిచేశారు. అక్క అఖిలారెడ్డి, సోదరుడు బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకునేందుకు ఆమె ప్రచారం చేశారు. అయితే మర్యాదపూర్వకాంగానే కలిసినట్లు వారు చెప్పారు. అయితే మౌనికారెడ్డి ఈ సారి పోటీ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ఆమె టీడీపీ నుంచి సీటు ఆశిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్నది. భూమా ఫ్యామిలీలో కూడా కొంత గ్యాప్ ఉందని, ఆళ్లగడ్డ నుంచి మౌనికా రెడ్డి బరిలోకి దిగాలనుకుంటున్నట్లుు టాక్ వినిపిస్తున్నది. అయితే దీనిని వారెవరూ అధికారికంగా ధ్రువీకరించలేదు. మరి మోహన్ బాబు వైసీపీలో ఉంటే.. మనోజ్ టీడీపీ అధినేత చంద్రబాబును కలవడం చర్చనీయాంశమైంది.