Avinash Reddy: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం రోజుకో మలుపు తిరుగుతుంది.15మార్చి 2019 న తన ఇంట్లో హత్యకు గురైన వివేకానంద రెడ్డి మొదటగా బాత్ రూంలో కాలు జారీ సాధారణ మరణంగా పోలీసులు భావించారు.. అయితే అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయిడు ఇది సాధారణ మరణం కాదని ఈ హత్య తో వైఎస్ జగన్ కు సంబంధం ఉందని ఆరోపించారు. ప్రభుత్వము తరుపున సిట్ వేశారు. సిట్ దర్యాప్తు మెల్లగా సాగడంపై వివేకా కూతురు వైఎస్ సునీత కోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు.. సిట్ తో కాకుండా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ పై స్పందించిన కోర్ట్ సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది.
హత్య కేసులో అనుమానితులుగా భావించిన గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరిలను అరెస్ట్ చేసి విచారణ మొదలు పెట్టింది. ఈ క్రమంలో దస్తగిరి అప్రూవర్ గా మరి వివేకా హత్యకు దారి తీసిన పరిస్థితులను సీబీఐకి చెప్పాడు…2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకా ఓటమికి భాస్కర్ రెడ్డి కృషి చేసారని … అప్పటి నుంచే వివేకా ఆగ్రహంతో ఉండేవారని.. రాజకీయంగా వివేకాను అడ్డు తొలగించుకోవాలని భాస్కర్ రెడ్డి భావించే వారని ఇందులో భాగంగానే వివేకా హత్య జరిగిందని దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చాడు..
వివేకా హత్య కోసం 40 కోట్ల డీల్ జరిగిందని ఇందులో 5 కోట్లు తనకు ఇస్తానని గంగిరెడ్డి తనకు చెప్పారని దస్తగిరి చెప్పాడు…
ఇప్పుడు 4o కోట్ల డీల్ పై ఈడీ దృష్టి సారించింది… 40 డీల్ పై అవినాష్ రెడ్డి ని విచారించనుంది… 40 ఎక్కడి నుంచి వచ్చాయి.. ఇందులో ఎవరు ఎవరు భాగస్వాములుగా ఉన్నారు అనే కోణంలో విచారించే అవకాశం ఉంది.. ఇదే జరిగితే వైఎస్ అవినాష్ రెడ్డి కి మరిన్ని కష్టాలు ఎదుర్కొనున్నాడు….