YS Avinash Reddy :
ఏపీ సీఎం సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై వివేకా కూతురు డాక్టర్ సునీత కూడా సుప్రీం ను ఆశ్రయించారు. తన అభ్యంతరాలను వాదనలను కోర్టు ముందు ఉంచారు. వీటిని విన్న న్యాయస్థానం సెప్టెంబర్ 11న ఈ కేసు విచారించాలని నిర్ణయించారు. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. అయితే అవినాష్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని అఫిడవిట్ దాఖలు చేసింది.
జూలైలో సునీత దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. అందుకే సుప్రీంకోర్టు విచారణను సెప్టెంబర్ కు వాయిదా వేసింది. మరో వైపు సీబీఐ కనీసం దర్యాప్తు గడువు పొడిగించాలని కూడా కోరలేదు. అప్పట్నుంచి వివేకా కేసులో ఎలాంటి పరిణామాలు లేవు. గతంలో సుప్రీంకోర్టు జూన్ 30 వ తేదీలోపు దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఆ గడువు పూర్తయినా ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి. అయినా దర్యప్తు కొనసాగించాలని సమయం కోరుతున్నదాి.
గంగిరెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణ సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసు చాలా సీరియస్ అని అభిప్రాయ పడింది. . కేసు వివరాలను సీల్డ్ కవర్ లో అందజేయాలని ఆదేశించింది.గంగిరెడ్డి తరపు లాయర్లపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్ తోపాటు పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఇప్పుడు సీబీఐ కూడా అదే కొరడంతో, పదకొండో తేదీన విచారణలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.