Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల బాలుడు ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్ పుర్ జిల్లా జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ అనే ఆరేళ్ల బాలుడు తల్లిదండ్రులతో కలిసి దుబాయ్ లో ఉంటున్నాడు. యువన్ మొదటి తరగతి చదువుతున్నాడు. ఆ బాలుడు ట్రెక్కింగ్ కోసం ఆరు నెలల పాటు కఠిన శిక్షణ తీసుకున్నాడు.
గైడ్ సహాయంతో ఏప్రిల్ 8న యువన్ తన తండ్రితో కలిసి ట్రెక్కింగ్ ప్రారంభించారు. 11 రోజుల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. అందులో 8 రోజులు ట్రెక్కింగ్ చేశారు. అనంతరం గైడ్ సలహా మేరకు వారు విశ్రాంతి తీసుకున్నట్లు యువన్ తండ్రి సుభాష్ చంద్ర వివరించారు. యువన్ స్విమ్మింగ్, మార్షల్ ఆర్ట్స్, రన్నింగ్ లో కూడా ప్రావీణ్యం పొందినట్లు ఆయన తెలిపారు.