14 మంది ప్రధాన మంత్రులు 56 లక్షల కోట్ల అప్పు చేస్తే ఒక్క మోడీ మాత్రమే వంద లక్షల కోట్ల అప్పు చేశాడని, ఆ అప్పు దేనికి ఖర్చు చేసాడో చెప్పాలని డిమాండ్ చేసాడు తెలంగాణ ఐటీ , మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావాలని భావించిన కేటీఆర్ దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రధాని మోడీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.
తెలంగాణ అప్పులు చేస్తోందని, ఒకవైపు మోడీ మరోవైపు బీజేపీ నాయకులు అబద్ధాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని , మేము చేసిన , చేస్తున్న అప్పులను అభివృద్ధి కోసం , అలాగే రాష్ట్రం ఆర్ధికంగా అభివృద్ధి చెందడం కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నామని ……. ఇలా చేయడం తప్పు కాదని , కానీ మోడీ ప్రభుత్వం మాత్రం వంద లక్షల కోట్ల అప్పు చేసి దేని కోసం ఖర్చు చేసిందో చెప్పడం లేదని దుయ్యబట్టాడు.