supreme court ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ఇంకా కొన’సాగు’తూనే ఉంది. గతనెల 30 లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలున్నా. ఆదిశగా సీబీఐ దర్యాప్తు పూర్తి చేయలేకపోయింది. పైగా ఏపీ ప్రభుత్వ పెద్దలు దర్యాప్తు ముందుకు సాగకుండా ఒత్తిళ్లు తెస్తున్నారని పలుమార్లు తెలిపింది.
అయితే గతవారం సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు వెనక్కి పంపింది. పలు సాంకేతిక కారణాలతో దీనిని వెనక్కి పంపుతున్నట్లు తెలిపింది. దీంతో సీబీఐ మరోసారి సరిచేసి చార్జీషీట్ ను దాఖలు చేసింది. అయితే కోర్టు ఇటీవల కేసులోని ఆరుగురు నిందితులకు రిమాండ్ పొడిగించింది. అయితే ఈ కేసులో సీబీఐ ఇప్పటివరకు రెండు చార్జీషీట్లను దాఖలు చేసింది. ఇది మూడోది. ఇందులో అవినాష్ రెడ్డికి సంబంధించిన విషయాలను పేర్కొంది. అయితే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ ను సీబీఐ కోర్టు ఈనెల 20 న విచారించనుంది.
ఈ కేసులో చంచల్ గూడ జైలులో ఉన్న నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ భాస్కర్ రెడ్డి శివ శంకర్ రెడ్డి రిమాండ్ ను జూలై 14 వరకు సీబీఐ కోర్టు పొడిగించింది. అయితే వివేక హత్య కేసులో విచారణను సీబీఐ వేగంగా చేపట్టడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నది. మరోవైపు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడంపై వైఎస్ సునీత ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు ఈ చార్జిషీటు వెనక్కి పంపడంతో సీబీఐకి ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది.