రంగుల ప్రపంచంలో ఎదగాలంటే పోటీని తట్టుకోవాలి. ఇప్పటి యూత్ దాన్ని తట్టుకోలేకనే ఒకటి లేదా రెండు ప్రాజెక్టులతోనే ఇంటి బాట పడుతుంది. ఇక కొందరు అన్నింటినీ తట్టుకొని పరిశ్రమలో దీర్ఘకాలం పని చేస్తుంటారు. ఇలా పని చేసిన వారిలో అలనాటి నటులు ఎంతో మంది ఉన్నారు. వారు పడే కష్టం గురించి చెప్తే నిజంగా కళ్లు చెమర్చకమానదేమో. ఒక బుల్లితెర నటి తన కెరీర్ బిగినింగ్ నాటి సంగతులను పంచుకుంది. అవి విన్న ప్రతీ ఒక్కరూ చలించిపోయారు.
రంగుల ప్రపంచంలో ఎదగాలంటే ‘కష్టానికి కొలమానం పెట్టువద్దు.. త్యాగానికి హద్దులను కూడా చెడిపేయాలి’ అని కొందరు చెప్తుంటారు. ఇవన్నీ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేని వారికి వర్తిస్తాయి. ఇక బ్యాగ్రౌండ్ ఉంటే కష్టంతో పెద్దగా పని ఉండనవసరం లేదు. ఏ ప్రాజెక్ట్ అయినా ఎప్పుడైనా తాపీగా కూడా చేసుకోవచ్చు. ఇది ఇండస్ట్రీలో జరుగుతున్నదే.
ఓ సీరియల్ నటి కెరీర్ బిగినింగ్ లో తాను పడిన కష్టాలను తాజాగా వివరించింది. ఆమె ఎవరంటే ‘జుహీ పర్మార్’. ‘కుంకుమ్’ సీరియల్ తో పాపులర్ అయ్యింది ఈ నటి. ఆ సీరియల్ కోసం 30 గంటల పాటు నాన్ స్టాప్ గా పని చేసిందట. 2002లో ప్రారంభమైన ఈ సీరియల్ 2009 వరకూ అంటే దాదాపు ఏడు సంవత్సరాల పాటు టెలికాస్ట్ అయ్యింది. ఈ సీరియల్ కోసం జుహీ పర్మార్ పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడిందట.
ఇప్పుడు షూటింగ్ అది సినిమా అయినా.. సీరియల్ అయినా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే కొనసాగుతున్నాయి. కానీ దాదాపు 20 సంవత్సరాలకు ముందు ఉదయం 8 గంటలకు సెట్ లో ఉండాలని కండీషన్ పెట్టేవారట డైరెక్టర్. దీంతో జుహీ పర్మార్ వారు చెప్పినట్లు, చెప్పిన సమయానికి సెట్ కు వచ్చేదట. చిన్నతనంలో స్కూల్ కు ప్రేయర్ కు ముందు ఎలా వెళ్లామో అలానే వెళ్లానని చెప్పింది. ఉదయమే లేని త్వర త్వరగా తయారై సెట్ కు వెళ్లేదట. ఇంత కష్టపడ్డదానికి ప్రతిఫలం దక్కిందనే చెప్తుంది. ఈ సీరియల్ ఆమె జీవితానికి టర్నింగ్ ఇచ్చిందని చెప్పవచ్చు.