Samantha-Naga Chaitanya సమంత-నాగ చైతన్య.. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు. ఈ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘ఏం మాయ చేశావే’ నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి అది పెళ్లి పీటలు ఎక్కే వరకు తీసుకెళ్లింది. అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లానన్న ఆనందం నుంచి తేరుకోక ముందే విడాకులు తీసుకొని విడిపోయింది ఈ జంట. ఈ క్రమంలో తమ అభిప్రాయాలను విడి విడిగా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. వీరి పోస్టులు ఎప్పుడూ హాట్ టాపిక్ లు గా మారుతున్నాయి.
వారిద్దరూ విడిపోయి రెండేళ్లు గడుస్తున్నా కూడా నాగచైతన్య అభిమానులకు సమంతపై ఉన్న కోపం తగ్గట్లేదు. తాజాగా సమంత తల్లి నాగచైతన్య పై లీగల్ గా చర్య తీసుకోవాలనుకున్న ఒక వార్త వైరల్ అవుతుండగా, దీనిపై నాగ చైతన్య అభిమానులు సమంతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి సమంత ‘వయోసైటిస్’ అనే వ్యాధితో పోరాటం చేస్తుంది.
ఆ జబ్బు వచ్చినప్పుడు మొదట్లో సమంత బాగా నీరసించిపోయేది. దీంతో చిక్కిపోయినట్లుగా కనిపించేది. ఈ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లింది. ట్రీట్మెంట్ సమయంలో సినిమాల్లో నటించడానికి కాస్త విరామం తీసుకుంది. వ్యాధి నుంచి కొంత కోలుకొన్న తర్వాత తను ఎగ్రిమెంట్ లోని సినిమాలను పూర్తి చేయగలిగింది. ఇప్పుడు మళ్లీ ఆ వ్యాధి ఇబ్బంది పెడుతుండడంతో తాను ఒప్పుకున్న ప్రాజెక్టులను రద్దు చేసుకొంది. ఆ ప్రాజెక్టులకు సంబంధించి తీసుకున్న అడ్వాన్స్ లన్నీ రిటర్న్ ఇచ్చేసింది. ట్రీట్మెంట్ కోసం మరల ఫారిన్ వెళ్లిందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.
‘సమంత, నాగచైతన్యతో ఉన్నప్పటి సమయంలోనే ఈ వ్యాధి వచ్చిందట. ఆ టైంలో నాగచైతన్య సమంతపై సరైన శ్రద్ధ చూపలేదు. వారి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా విడాకులు కూడా అవ్వడంతో సమంత డిప్రెషన్ లోకి వెళ్లింది. దీంతో ఇప్పుడు మరల వ్యాధి తిరగబెట్టడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది’ అని సమంత తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇలా సమంత ఆరోగ్యం క్షీణించిపోవడానికి కారణం నాగచైతన్య అని, అతనిపై లీగల్ చర్యలు తీసుకోవాలని సమంత తల్లి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. దీనిపై నాగ చైతన్య ఫ్యాన్స్ కూడా భిన్నంగా స్పందిస్తున్నారు.