Samantha Naga Chaitanya : టాలీవుడ్ నటుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలోని టస్కానీలోని సుందరమైన లొకేల్లో రేపు జరగనుంది. ఈ వివాహ వేడుకకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీ టాలీవుడ్ లోని హీరోలు, హీరోయిన్స్ తో పాటు ప్రముఖులను ఆహ్వానించింది. ఇందులో భాగంగా అక్కినేని నాగ చైతన్య, సమంతకు కూడా ఆహ్వానాలు పంపారు.
ఇప్పటికే సమంత, రష్మిక మందన్న, నాగ చైతన్య హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు. వారు వరుణ్ తేజ్ వివాహానికి వెళ్తున్నట్లు చెప్పారు. అయితే, ఈవెంట్లో చైతన్య, సమంత ఒకరినొకరు ఎదురు పడేలా కనిపిస్తుంది. ఒక వేళ ఇదే జరిగితే ఒకరికొకరు ఎలా స్పందిస్తారో చూడాలని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రీ వెడ్డింగ్ వేడుకలు కాక్టెయిల్ పార్టీతో ప్రారంభమయ్యాయి, నిన్న (అక్టోబర్ 30) రాత్రి వేడుక వాతావరణం ప్రారంభమైంది. నేడు, హల్దీ, మెహందీ వేడుకలు జరగనున్నాయి. పెళ్లి రోజు, రేపు (నవంబర్ 1) మధ్యాహ్నం వివాహానికి ముహూర్తం ఉంది. పెళ్లి తర్వాత, సాయంత్రం రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు.
డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత, వరుణ్ – లావణ్య హైదరాబాద్కు తిరిగి వస్తారు. ఇటలీకి రాని వారి కోసం.. మరియు ఇక్కడి బంధువుల కోసం మెగా ఫ్యామిలీ మరో రిసెప్షన్ ను ప్లాన్ చేసింది. నవంబర్ 5వ తేదీ (ఆదివారం) రిసెప్షన్ ప్లాన్ చేశారు. ఈ గ్రాండ్ ఈవెంట్ లో చలన చిత్ర ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అందరికీ ఆహ్వానలు పంపినట్లు తెలుస్తోంది.