![Madhya Pradesh](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-7.1-1.jpg)
Madhya Pradesh : మధ్యప్రదేశ్ లోని ఛింద్వాడాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రకాశ్ ఇండియన్ టాటా 84 ఏళ్ల వయసులో ఎనిమిదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. చదువుకోవాలన్న తపనతో తొలుత మధ్యప్రదేశ్ ఓపెన్ బోర్డు నుంచి ఐదో తరగతి పరీక్షలు రాశారు. ప్రస్తుతం 8వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.
ఆయన సాధారణ ఆయుర్వేద వైద్యడేమీ కాదు. ఆయనకు ఎంతో పేరు ఉంది. బాలీవుడ్ బీగ్ బీ అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, శిల్పాశెట్టి సహా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఎంతోమంది విదేశీ వ్యాపారవేత్తలకు సేవలు అందించారు. శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యకు కూడా ఆయన వైద్యం చేశారు. మొత్తం 112 దేశాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు కూడా ఆయుర్వేద వైద్యం చేశారు. ప్రస్తుతం 8వ తరగతి పరీక్షలు రాస్తున్న ఆయనను చూసిన విద్యార్థులు నోరెళ్లబెడుతున్నారు.