YS Sharmila : డాక్టర్లు అవుదామని ఆశతో ఉన్న 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు విజయవాడలోని లెనిన్ కూడలిలో షర్మిల నిరసన కార్యక్రమం చేపట్టారు. పరీక్షకు ఆలస్యంగా వస్తే గ్రేస్ మార్కులు ఎలా ఇస్తారు? రెండు నిమిషాలు అదనపు సమయం ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టను దిగజార్చేలా నీట్ పేపర్ లాక్ స్కాం జరిగిందనే ఆధారాలు బయటపడ్డాయన్నారు. అవకతవకలు జరిగినా ఎన్టీయే మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే పేపర్ లీక్ అయిందన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.