AP Assembly : ఏపీలో గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఏపీ మంత్రి వర్గ భేటీ జరగనుంది. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ జరుగుతున్న ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అటు కేంద్రంలోనూ మారుతున్న పరిణామాల దృష్ట్యా ఈ సమావేశాలు కీలకం కానున్నాయి. ఇక ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కూడా ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తున్నది.
ఏపీ మంత్రివర్గం బుధవారం భేటీ కానుంది. ఇందులో ప్రధానంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సవరించిన నిర్ణయాలకు ఆమోదం తెలుపనున్నారు. దీంతో పాటు జీపీఎస్ అంశంపైనా చర్చించే అవకాశం కనిపిస్తున్నది. దీంతో పాటు పాలనాపరమైన నిర్ణయాలతో పాటు రాజకీయ అంశాలపైనా చర్చించే అవకాశమున్నది. కేంద్రం తీసుకొచ్చిన మహిళా బిల్లు అంశంపైనా చర్చించే అవకాశం కనిపిస్తున్నది. కేంద్రం తీసుకొచ్చే ఇతర బిల్లులపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారని తెలుస్తున్నది.
కాగా రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అంశంపైనా చర్చించే అవకాశమున్నది. చంద్రబాబుకు ఈ అవినీతిలో పాత్ర ఉందని అసెంబ్లీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు కాదని, చంద్రబాబు నేరం చేశారని చెప్పే ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా అమలు చేయాల్సిన వ్యూహాలపైనా చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. ఏదేమైనా చంద్రబాబు అరెస్ట్ అ నంతరం ప్రజల్లో భావోద్వేగాలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు జరిగే ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.