- లింగమనేనికి attachment ని డిస్మిస్ చెయ్యమనే హక్కు లేదు
End of TDP : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్ తగిలింది. కరకట్టపై ఉంటున్న చంద్రబాబు గెస్ట్ హౌస్ ను వైసీపీ సర్కార్ గతంలో అటాచ్ చేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మంత్రి నారాయణతో కలిసి తమ పదవీని దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది. ఈక్రమంలోనే వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుపై అభియోగాలు మోపుతూ వస్తోంది.
ఈక్రమంలోనే తాజాగా విజయవాడ ACB కోర్టు లింగమని రమేష్ వేసిన కరకట్ట అటాచ్మెంట్ పిటిషన్ డిస్మిన్, అతనికి అటాచ్మెంట్ వ్యతిరికించే అర్హత లేదు.. అతని వాదనలు వినాల్సిన అవసరమే లేదని పేర్కొంది. CASE 16.6. న CID వారు రికార్డ్ సమర్పిస్తే అటాచ్మెంట్ ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించిన అన్ని వివరాలను తమ ముందు ఉంచాలన్న ఏసీబీ కోర్టు. ఈ నెల 16కి తదుపరి విచారణ వాయిదా వేసింది.