Prashant Kishore : ఏపీలో ఎన్నికలు పార్టీల అధినేతలకు ప్రతిష్ఠాత్మ కంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన తమ అభ్యర్దుల తొలి జాబితా విడుదల చేసాయి. బీజేపీ తమతో కలిసి వస్తుందని రెండు పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ ఆలోచన భిన్నంగా ఉన్న ట్లు ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. జగన్ కు ధీటుగా సంక్షేమ పథకాలు, ప్రచారంతో పాటుగా..అభ్యర్దుల విషయంలోనూ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
కీలక మంతనాలు..
ఈ సారి ఎన్నికల్లో చంద్రబాబు ప్రతీ నిర్ణయం ఆచి తూచి తీసుకుంటున్నారు. అభ్యర్దుల ఎంపిక విష యంలోనూ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత కసరత్తు చేసినట్లు వెల్లడించారు. తొలి జాబితాలో 94 మంది అభ్యర్దులను ఖరారు చేసా రు. పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటా యించారు. బీజేపీతో పొత్తు పైన చర్చలు జరిగి నా..ఆ పార్టీ నిర్ణయం ఏంటనేది అధికారికంగా స్పష్టత రాలేదు. బీజేపీ ఒంటరి పోరుకే సిద్దం అవుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో, రెండో జాబితా పైన చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఈ సమయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు వీరిద్దరి సమావేశం జరిగింది.
జాబితాపై కసరత్తు..
పొత్తులో జనసేనకు కేటాయించిన సీట్లను మినహాయిస్తే మరో 57 స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేయాల్సి ఉంది. బీజేపీ పొత్తుకు ముం దుకు వస్తే ఆ పార్టీకి కేటాయించాల్సిన సీట్ల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తుకు నిరాకరిస్తే జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తా రనేది స్పష్టత రావాల్సి ఉంది.
తాజాగా ప్రశాంత్ కిశోర్ భేటీలో ప్రధానంగా జగన్ అమలు చేస్తున్న సామాజిక సమీకరణా లు..ధీటు గా కూటమి నుంచి అభ్యర్దుల ఎంపికలో అమలు చేయాల్సిన సోషల్ ఇంజనీరింగ్ పైన చర్చ జరి గిన ట్లు సమాచారం. అదే సమయంలో మిగిలిన 57 స్థానాల్లోనూ ఏ వర్గానికి ఎన్ని అవకాశం ఉంది..జగన్ సామాజిక లెక్కలను అధిగమించే స్థాయిలో ఉండేలా కూర్పూ చేయాలని నిర్ణయిం చినట్లు తెలుస్తోంది. ఇక, పార్టీ మేనిఫెస్టో పైన ప్రశాంత్ కిశోర్ సూచినలు చేసినట్లు చెబుతున్నారు.