![Ban on Exit Polls](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/11/exitpoll.jpg)
Ban on Exit Polls Five States : దేశంలో ఐదు రాష్ర్టాల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. ఈనెల 3న నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం చేసింది. ఇక ఈ సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఐదు రాష్ర్టాల్లో ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించింది. ఈ ఆదేశాలు ఈనెల 30 వరకు అమల్లో ఉంటాయని మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
నవంబర్ 7వ తేదీ నుంచి ఉదయం నుంచి నంబర్ 30 వతేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోడ్ అమల్లో ఉండగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం. ప్రచారం చేయడం ఫలితాలు ప్రకటించడం లాంటివి చేయరాదని ఎన్నికల సంఘం పేర్కొంది.
ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా, ఛత్తీస్ గఢ్ రాష్ర్టంలో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనండగా, మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో వరుసగా నవంబర్ 7, 17, 25,30 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలకు ఎన్నికలు సిద్ధమయ్యాయి. అభ్యర్థుల ప్రకటన కూడా తుది దశకు చేరుకుంది. ఇక రాజస్థాన్, కాంగ్రెస్ రాష్ర్టాల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మధ్య ప్రదేశ్ లో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది.