Odisha train accident : ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనకు సిగ్నల్ లోపమే కారణమని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఓ సంచలన విషయం బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో పశ్చిమ మధ్య రైల్వే లో పని చేసిన హరి శంకర్ ఇంటర్ లాకింగ్ కోసం రూపొందించిన సిస్టమ్ బైపాస్ గా మార్చగా లోపాలను మూడునెలల క్రితమే గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిని నిలిపి వేయాలని ఆయన రైల్వే బోర్డును కోరారు. రైలు బయలేర్దాక డిస్పాచ్ రూట్ మారుతోందని దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆయన ముందస్తుగానే హెచ్చరించినట్లు ఆయన రాసిన లేఖ ద్వారా అర్థమవుతోంది.
Breaking News