Priyanka Gandhi : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈనెల 12న మధ్యప్రదేశ్ కు రానున్నారు. సంకల్ప్ 2023 కార్యక్రమంలో భాగంగా జబల్ పూర్ లో ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించనున్నారని జబల్ పూర్ మేయర్, కాంగ్రెస్ నగర చీఫ్ జగత్ బహదూర్ సింగ్ తెలిపారు. ప్రియాంక గాంధీ నగరంలో రెండు కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించి ర్యాలీలో ప్రసంగిస్తారని తెలిపారు. ఈ ర్యాలీలో సుమారు 2లక్షల మంది ప్రజలు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక త్వరలోనే మహాకోశల్ ప్రాంతంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు జగత్ బహదూర్ సింగ్ తెలిపారు.