25.2 C
India
Tuesday, July 2, 2024
More

    Sudden Floods : ఆకస్మిక వరదలు.. లద్దాఖ్ లో ఐదుగురు జవాన్ల మృతి

    Date:

    Ladakh
    Ladakh

    Sudden Floods : చైనా సరిహద్దు లద్దాఖ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ లోని వాస్తవాధీన రేఖ సమీపంలో గల న్యోమా-చుషుల్ ప్రాంతంలో భారత సైన్యం విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. లేహ్ కు 148 కి.మీ. దూరంలోని బోధి నదిలో శనివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

    సైనిక విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంక్ లతో నదిని దాటుతుండగా ఈ వరదలు సంభవించాయి. దీంతో నదిలో ఉధృతి పెరిగి టీ-72 ట్యాంక్ మునిగిపోయింది. అందులోని ఐదుగురు జవాన్లు నదిలో కొట్టుకుపోయారు. అప్రమత్తమైన సైన్యం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. జవాన్ల కోసం నదిలో గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది.

    దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు మృతి చెందినట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. మృతుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నారు. ప్రమాదంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    Share post:

    More like this
    Related

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related