Earthquake :
రాజస్థాన్ లో భూమి కంపించింది. రాజధాని జైపూర్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంబవించింది. దీంతో ప్రజలు పరుగులు తీశారు. శుక్రవారం తెల్లవారు జామున 4.09 నుంచి 4.25 మధ్య మూడుసార్లు ప్రకంపనలు భయపెట్టాయి. గాఢ నిద్రలో ఉండగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఆరావళి కొండల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదైందని నేషనల్ సిస్మాలజీ కేంద్రం తెలియజేసింది. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు వార్తలు మాత్రం రాలేదు. గత మార్చి 21, జనవరి 24 తేదీలలో జైపూర్, రాజస్థాన్ లలో పలు జిల్లాల్లో భూకంపం వచ్చింది. ఇటీవల కూడా సికార్ జిల్లాను భూకంపం భయపెట్టింది. భూకంపంపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె ట్విట్టర్ వేదికగా స్పందించారు.
రాజధాని జైపూర్ తో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. గంటల వ్యవధిలోనే భూమి మూడుసార్లు కంపించడంతో భయాందోళన చెందారు. నిద్రలోంచి ఉలిక్కిపడ్డారు. ఎవరికి ఎలాంటి గాయాలు రాకపోయినా జనం మాత్రం భయం గుప్పిట్లో గడిపారు. వీధుల్లోకి వచ్చి ఏం జరుగుతుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు.
ఇలా భూకంపం ప్రజలను భయపెట్టింది. తెల్లవారు జామున కావడంతో చాలా మందికి తెలియలేదు. మెలకువగా ఉన్న వారు మాత్రం బయటకు పరుగులు తీశారు. అక్కడక్కడ జనం గుమిగూడారు. ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. భూమి కంపించడం మాత్రం కనిపించింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో కనిపించారు.