సోమవారం అర్ధరాత్రి తర్వాత చైనాలో భూకంపం సంభవించింది. చైనాలోని దక్షిణ జిన్యాంగ్ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. భూకంప కేంద్రం 80 కిలో మీటర్ల లోతు లో ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ వెల్లడించింది. మొదట తెల్లవా రు జామున 2 గంటల 9 నిమిషాలకు భూకంపం సంభవించింది.
ఆ తర్వాత 2 గంటల వ్యవధిలోనే 14 సార్లు భూమి కంపించింది. అయితే ఈ భూకంప తీవ్రత మన దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది. ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో బలమైన భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పక్క దేశంలో భూకంపం సంభవించినప్పుడు దాని తీవ్రత ఢిల్లీని తాకడం ఇది కొత్తేం కాదు. ఈ ఏడాది జనవరి 11న అప్ఘానిస్థాన్లో 6.1 తీవ్రతతో భకంపం సంభవించింది. అప్పుడు కూడా భూప్రకంపనలు ఢిల్లీని తాకాయి. నేపాల్లో భూకంపం సంభవించినప్పుడు కూడా దాని తీవ్రత ఢిల్లీపై పడుతుంటుంది