Guntur Karam Update :
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ మాస్ మసాలా మూవీ ”గుంటూరు కారం”.. ఈ సినిమా గత కొద్దీ రోజుల క్రితం షూట్ స్టార్ట్ చేసుకుంది.. అయితే ఈ సినిమాను ఏ ముహూర్తాన స్టార్ట్ చేసారో కానీ స్టార్ట్ అయినప్పటి నుండి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటు వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూట్ శరవేగంగా జరుపు కుంటుంది.
ఇటీవలే మహేష్ బాబు వెకేషన్ నుండి బయటకు రావడంతో షూటింగ్ స్టార్ట్ చేసారు. రెండు నెలల లాంగ్ గ్యాప్ తర్వాత స్టార్ట్ అయినా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ కాంబో ఇప్పటికే రెండు సార్లు వచ్చింది.. అతడు, ఖలేజా తర్వాత మూడవసారి ముచ్చటగా ఈ కాంబో కలిసింది.
దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. 12 ఏళ్ల తర్వాత ఈ కాంబో రానుంది.. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ వైరల్ అయ్యింది.
ఈ సినిమా ఫస్ట్ సింగిల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యిందట.. అందుకే గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు టైం ఫిక్స్ చేశారట.. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ పాటకు సంబంధించిన అనౌన్స్ మెంట్ రాబోతుందని సమాచారం.. వినాయకచవితి కానుకగా సాంగ్ ను రిలీజ్ చేయనున్నారట.. మొత్తానికి పండుగతో పాటు ట్రీట్ కూడా రావడంతో ఫ్యాన్స్ కు డబల్ ట్రీట్ అనే చెప్పాలి..
ReplyForward
|