Mahesh Babu :
సూపర్ స్టార్ మహేశ్ బాబు-మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మహేశ్ బాబుకు జోడీగాపూజా హెగ్డేను తీసుకున్నా.. డేట్స్ అడ్జస్ట్ కాక ఈ ప్రాజెక్టు్ నుంచి ఆమె తప్పుకుంది. దీంతో హీరోయిన్ గా శ్రీలలను.. రెండో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు మేకర్స్.
ఈ సినిమాలో హీరో మహేశ్ బాబు హీరోయిన్ మీనాక్షి చౌదరి కోసం గొప్ప త్యాగం చేస్తాడని. ఈ సన్నివేశం గుండెలను పిండేసే సెంటిమెంట్ ఉంటుందని లీకులు వస్తున్నాయి. మీనాక్షి చౌదిరి పాత్ర సెకండాఫ్ లో వస్తుందట. ఇందులో ఆమె రోలే ప్రధానమైనదని అంటున్నారు. శ్రీలీల పాత్ర గ్లామర్ పరంగా హైలెట్ అవుతుందని.. అయితే, కథ మొత్తం మీనాక్షి చౌదరి పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది.
హీరో మహేశ్ బాబు.. విలన్ల మధ్య జరిగే వార్ మీనాక్షి చౌదరి కోసమే నట. ఇప్పటికే ‘గుంటూరు కారం’లో మీనాక్షి చౌదరి మీద త్రివిక్రమ్ చాలా వరకు సన్నివేశాలు తెరకెక్కించారు. కథ అంతా గుంటూరు మిర్చీ యార్డ్ నేపథ్యంలోనే నడుస్తోందట. మహేశ్ బాబు బాడీ లాంగ్వేజ్ కు సరిపడా కథతో త్రివిక్రమ్ ఈ మూవీని రెడీ చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సైతం ఒకేసారి రిలీజ్ చేసేలా సిద్ధం చేస్తున్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ మహేశ్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇది బెస్ట్ చిత్రంగా మారే అవకాశం ఉది. ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా తీయబోతున్నారు. దానికి రెడీ అవుతున్నారట. ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా 13 జనవరి, 2024న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.