Adipurush 2023 : ‘ఆదిపురుష్’ సినిమాపై అంచనాలు రోజుకోవిధంగా మారుతున్నాయి. సినిమా ఎలాగోలా పూర్తయ్యింది. ఇక రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ప్రాంతాల వారీగా రేటుపై వార్తలు వినిపిస్తున్నాయి. రూ. 185 కోట్లకు తెలుగు రాష్ట్రాలకు విక్రయిస్తుందనే వార్త సంచలనంగా మారింది. ఈ సినిమాకు ఇంత రేటు పలుకుతుందా..? అసలు పీపుల్స్ మీడియా ఇంతరేటుతో ఎందుకు కొనుగోలు చేసింది..? దాని స్ట్రాటజీ ఏంటి..? అనే సందేహాలు సినిమా విశ్లేషకులను కూడా పట్టి పీడిస్తోంది. ఇందులో నైజాంను ఎంతకు ఇస్తారు. ఆంధ్రా ఎంతకు..? అన్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఓ హోల్ సేల్ బేరం పీపుల్స్ మీడియాను సంప్రదించినట్లు తెలుస్తోంది. వెస్ట్ కు చెందిన ఉషా ఫిలిం పంపణీ సంస్థ కొందరితో కలిసి ఆంధ్రా ప్రాతంలో రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఉషా ఫిలిం సంస్థ ఈస్ట్ అనుశ్రీ ఫిలింస్ కూడా వీరితో జాయిన్ అయినట్లు ఇండస్ట్రీలో గాసిప్ లు వినిపిస్తు్న్నాయి. ఆంధ్ర ఏరియాను రూ. 60 నుంచి రూ. 65 కోట్లకు హోల్ సేల్ గా ఇవ్వమని, ఇందులో 20 శాతం రికవరీ పెట్టాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే రూ. 50 కోట్లు నాన్ రికవరబుల్ అడ్వాన్స్ రూ. 15 కోట్లు రికవరబుల్ అడ్వాన్స్ అని తెలుస్తోంది. ఇలా చేస్తే కొనుగోలు దారులు పెద్దగా నష్టపోరు. కానీ పీపుల్స్ మీడియా సంస్థకు మాత్రం కొంత రిస్క్ ఉంటుంది
అందుకే ఈ బేరం ముందుకు వెళ్లకుండా ఇంకా ప్రపోజల్ స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర నుంచి రూ. 70 కోట్ల మేరకు నాన్ రికవరబుల్ అడ్వాన్స్ రావాల్సి ఉంటుందనే ఆలోచనలో పీపుల్స్ మీడియా ఉన్నట్లు తెలుస్తోంది.