Adipurush Author Manoj : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఘోర పరాభవంగా మిగిలిన సినిమా ”ఆదిపురుష్”.. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకోగా దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ప్రభాస్ ఫ్యాన్స్ వరుసగా రెండు పరాజయాలు ఎదురవడంతో ఆదిపురుష్ తో అయిన తమ హీరో హిట్ అందుకోవాలని కోరుకున్నారు.
కానీ ముందు రెండింటి కంటే దారుణమైన ప్లాప్ చవిచూడక తప్పలేదు. బాహుబలి రేంజ్ లో హిట్ అవుతుంది అని ఎన్నో ఆశలు పెట్టుకోగా ఆశలన్నీ ఓం రౌత్ నిరాశ చేసాడు. రామాయణం నేపథ్యంతో భారీ స్థాయిలో మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఘోరమైన పరాజయాన్ని అందుకుంది.
కనీసం డార్లింగ్ ఫ్యాన్స్ ను కూడా మెప్పించలేక పోయారు మేకర్స్. ఈ విషయంలో ఓ రేంజ్ లో మేకర్స్ ను ట్రోల్స్ చేసారు.. ఓం రౌత్ ను దారుణంగా విమర్శించారు. ఈ సినిమాలో నటీనటుల గెటప్స్, సెటప్స్, గ్రాఫిక్స్ ఇలా అన్ని విషయాల్లో తీవ్రమైన చర్చతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
ఈ సినిమా విషయంలో ఓం రౌత్ ఎంతగా నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొన్నారో అదే విషయం ఈ సినిమాకు సంభాషణలు అందించిన మనోజ్ ముంతషీర్ కూడా ఆ రేంజ్ లో విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా మనోశ్ ఆదిపురుష్ వైఫల్యంపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రపంచం ఒక రోజు మనల్ని మంచిగాను మరో రోజు చెడ్డవాడిగాను చూస్తుంది.. కానీ మన కుటుంబానికి మనం ఎప్పుడు హీరోలమే.. నేను ఒక తప్పు చేశాను ఆదిపురుష్ సినిమాకు పని చేయడమే నా తప్పు.. ఈ సినిమాకు నాకు ఎన్నో పాఠాలు నేర్పింది.. అందుకే ఇక నుండి జాగ్రత్తగా ఉంటాను అని మనోజ్ తెలిపారు..
ఆదిపురుష్ రిలీజ్ తర్వాత చంపుతాం అని కూడా బెదిరించారు.. విమర్శలకు నేను రియాక్ట్ కాకుండా ఉండాల్సింది.. విమర్శలు తీవ్రంగా రావడంతో నేను విదేశాలకు వెళ్ళిపోయా.. ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు.