World Cup 2023 : టీం ఇండియా క్రికెట్ మాజీ కేప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ గురించి దేశానికే కాదు ప్రపంచానికి కూడా పరిచయం అవసరం లేదు. తన హయాంలోనే క్రికెట్ లో భారతప్రతిష్టను ఖండాంతరాల్లోకి తీసుకెళ్లారు. ఆయనకు ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం యంగ్ క్రికెటర్స్ నుంచి ధోని కంటే సీనియర్ క్రికెటర్ల వరకు ఆయన అంటే చాలా అభిమానం. టీంను ముందుకు నడిపే విధానం.. ఖచ్చితత్వమైన నిర్ణయాలు (DRS) తీసుకోవడంలో ఎంపైర్ కంటే పై స్థాయిలో ఉంటారు ఆయన.
టీం ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు ధోని. 2007 టీ 20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్ షిప్ ట్రోఫీలను అందించి చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణ అక్షరాలను లిఖించుకున్నారు ఆయన. రిటర్మెంట్ ప్రకటించిన తర్వాత (2013) నుంచి ఇప్పటి వరకు (2023) వరకు టీం ఇండియాకు ఒక్క ఐసీసీ టోర్నీ కప్ రాలేదు. దీన్ని బట్టి చూస్తే మనకు ధోని కెప్టెన్సీ, ఆయన నిర్ణయాలు, ఆయన అనుభవాల గురించి స్పష్టంగా అర్థం అవుతుంది. వికెట్ల వెనుక (వికెట్ కీపర్) ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించే ధోనీ స్టంప్ అవుట్ చేయడంలో మహాధిట్ట. సెకండ్ల వ్యవధిలోనే ఎంతో మందిని పెవిలియన్ కు పంపాడు. ఇక వికెట్ల వెనకాలే ఉంటూ కూడా బౌలర్లకు సలహాలు ఇస్తూ జట్టును ఎలాగైనా విజయతీరానికి చేరుస్తాడు.
అయితే బీసీసీఐ ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే వరల్డ్ కప్ వస్తున్న నేపథ్యంలో టీం ఇండియా మెంటార్ గా ధోనీని నియమించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీ-20 వరల్డ్ కప్ సమయంలో కూడా టీం ఇండియాకు మెంటార్ గా ధోనీ వ్యవహరించారు. అప్పుడు మంచి విజయాలనే నమోదు చేసింది ఇండియా జట్టు. ఈ సారి వరల్డ్ కప్ ఇండియాలో జరుగనుంది. ఈ సారి ఎలాగైనా కప్పును చేజిక్కించుకోవాలని బీసీసీఐ పధకం వేసింది. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనికి ధోనీ కూడా ఒకే చెప్పాడట. ఇక త్వరలోనే బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.