MS Dhoni : మహేంద్ర సింగ్ దోని భారత క్రికెట్ దిగ్గజం. 2007, 2011 టీ 20, వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్. దోని చివర్లో వచ్చి మ్యాచ్ లు ఫినిష్ చేయడంలో దిట్ట. ఇండియా క్రికెట్ టీంలో దోని తర్వాత అలాంటి ఫినిషన్ ఇంకా దొరకలేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో మహేంద్ర దోని, వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ దుమ్ము రేపుతున్నారు.
దోని ముంబయితో వాంఖేడేలో జరిగిన మ్యాచ్ లో నాలుగు బంతుల్లో మూడు సిక్సుల సాయంతో మొత్తం 20 పరుగుల చేశాడు. దినేశ్ కార్తీక్ ముంబయి తో మ్యాచ్ లో 29 బంతుల్లోనే 60 పరుగులకు పైగా చేసి ఔరా అనిపించుకున్నాడు. ఆ నెక్స్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ తో జరగ్గా చెలరేగి ఆడి 35 బంతుల్లోనే 83 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్సీబీకి విరాట్ తర్వాత సరిగ్గా బ్యాటింగ్ చేస్తుంది దినేశ్ కార్తీక్ మాత్రమే.
దీంతో దినేశ్ కార్తీక్ మదిలో వరల్డ్ కప్ చల్ రహే అని ముంబయితో మ్యాచ్ లోనే రోహిత్ ఆట పట్టించాడు. అయితే రోహిత్ శర్మ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దోని ఉన్న ఫామ్ ను బట్టి రాబోయే టీ 20 వరల్డ్ కప్ ఈజీగా ఆడించొచ్చు. కానీ దోనిని కన్వెన్సింగ్ చేయడమే కష్టం అని చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు. మరి అంతలా దోని ఫామ్ లో ఉన్నాడు. వచ్చి రాగానే ముంబయిపై మూడు హ్యట్రిక్ సిక్సులు బాదడంతో అందరూ దోనిలో ఇంకా పవర్ తగ్గలేదని అంటున్నారు.
దినేశ్ కార్తీక్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో భారీ సిక్సులతో గొప్ప ఇన్సింగ్స్ లు ఆడాడు. మరి టీ20 వరల్డ్ కప్ లో దినేశ్ కు చోటు దక్కుతుందో లేదోనని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. గతంలో కూడా టీ 20 వరల్డ్ కప్ ముందు జరిగిన ఐపీఎల్ లో చెలరేగి ఆడి జట్టులో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. మళ్లీ అదే సీన్ రిపీట్ కాబోెతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంకో ఒకటి రెండు ఇన్సింగ్స్ లు అలా ఆడితే టీం ఇండియాలో దినేశ్ కార్తీక్ కు చోటు ఖాయమని జోస్యం చెబుతున్నారు.