Bhola shankar : లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ గురించి ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమాను నిర్మించిన అనిల్ సుంకర గురించి కూడా మీడియాలో ఓ రేంజ్ లో హడావిడి జరుగుతుంది. ఈ సినిమాతో నిర్మాత నుండి బయ్యర్ వరకు అందరు భారీగా నష్టపోయారు.. ఏకంగా 50 కోట్లకు పైగానే నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది.
స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘భోళా శంకర్’.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కెరీర్ లో దూసుకు పోతున్న మెగాస్టార్ కు భోళా శంకర్ పెద్ద షాక్ ఇచ్చింది. ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన తెచ్చుకోగా ఆ తర్వాత కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.
దీంతో చిరంజీవికి, అనిల్ సుంకరకు మధ్య విబేధాలు వచ్చాయని పుకార్లు రాగా వీటిపై నిన్న అనిల్ సుంకర ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చేసారు. చిరు నాకు పూర్తిగా సహకరించారు అంటూ ఈయన కామెంట్స్ చేసారు.. ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ నిర్మాతలకు వచ్చిన నష్టాలను చూసి తన రెమ్యునరేషన్ లో కోతణ్హా తిరిగి ఇచ్చారని అంటున్నారు.
వాల్తేరు వీరయ్యకు 50 కోట్లు అందుకున్న మెగాస్టార్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో భోళా శంకర్ కు 60 కోట్లు తీసుకున్నారట. షూటింగ్ సమయంలోనే 50 కోట్లు అందుకున్న చిరు 10 కోట్లను చెక్ రూపంలో అందుకోగా ఆ చెక్ ను రిలీజ్ తర్వాత బ్యాంకులో వేయాలని ఆగిపోయారట.. ఇప్పుడు అదే చెక్ ను నిర్మాతకు భోళా రిజల్ట్ చూసి ఇచ్చారని అంటున్నారు.
గతంలో కూడా ఆయన వల్ల నష్టపోయిన నిర్మాతలకు ఏదొక రూపంలో తిరిగి ఇచ్చాడని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు కూడా రెమ్యునరేషన్ రిటర్న్ ఇవ్వడంతో ఇది మెగాస్టార్ అంటే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.