Disadvatages of Spicy Foods : భారతీయ వంటల్లో కారం ఉండాల్సిందే. ఏ కూర చేసుకున్నా అందులో కారం లేకుండా కూర చేయడం వీలు కాదు. కారం వాడాల్సిందే. రుచిగా ఉండాలంటే ఉప్పు, కారం ప్రధాన పాత్ర పోషిస్తాయి. దీంతో కారం లేని ఆహారాలను ఊహించుకోవడం కష్టమే. అందుకే మన వంటల్లో కారం వేసుకుంటేనే రుచి తెలుస్తుంది. లేకపోతే ఆ కూరకు ఎలాంటి రుచి ఉండదు. అది పప్పు అయినా ఇతర వేరే కూర అయినా కారం వేస్తేనే దానికి మంచి సార్థకత వస్తుంది.
మన వంట గదిలో అన్నింటితో పాటు కారం ఉండాల్సిందే. స్పైసీ కోసం మిరప పొడి అధికంగా తింటే నష్టమే. కారం, మసాలాలు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమే. స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అజీర్తి, గ్యాస్, కడుపు మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే స్పైసీ ఫుడ్స్ పరిమితంగానే తీసుకోవడం మంచిదనే అభిప్రాయం ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది. ఒత్తిడి, ఆందోళన అధికమవుతాయి. మానసిక ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతుంది. ఇందులో ఉండే ఉప్పు, మసాలాల కారణంగా రక్తపోటు పెరుగుతుంది. ఇది దీర్ఘకాలిక గుండె జబ్బులకు దారి తీస్తుంది. స్పైసీ ఫుడ్ వల్ల చర్మం పొడిబారుతుంది. దీని వల్ల చర్మ సమస్యలు వస్తాయి.
స్పైసీ ఫుడ్స్ వల్ల అధిక బరువు పెరుగుతారు. ఇందులో ఉండే అధిక కేలరీలు ఉండటం వల్ల మరింత ఆకలిగా అనిపిస్తుంది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఫైల్స్ సమస్య కూడా వస్తుంది. దీంతో మసాలాలు, మిరప పొడి తినడం తగ్గిస్తేనే ఫలితం ఉంటుంది. లేకపోతే మన ఆరోగ్యం పాడవడం ఖాయం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.