భార్యాభర్తల బంధంలో ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. జీవితాంతం ఒకే వ్యక్తితో ఉండటం మామూలు విషయం కాదు. దీనికి మహిళలకు ఎంతో ఓపిక కావాలి. దీంతో దంపతుల మధ్య అవినాభావ సంబంధం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో మూడుముళ్ల బంధంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని మరీ జీవిత కాలం కలిసి ఉండటం మాటలు కాదు. ఒకే వ్యక్తితో జీవితాన్ని పంచుకునే సంప్రదాయానికి విదేశీయులు సైతం ఎంతో ఇష్టపడతారు. మూడుముళ్లు అంటే మూడు జన్మలన్న చందంగా ఆలుమగల మధ్య అన్యోన్యత ఉండటం సహజం.
ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం విడాకుల విషయంలో తీర్పు వెలువరించడంతో మహిళలు పండగ చేసుకుంటున్నారు. మహిళలకు నిజంగా దక్కిన కానుకగా అభివర్ణిస్తున్నారు. విడాకులు తీసుకునే విసయంలో ఇదివరకు ఆరు నెలల నిబంధన ఉండేది. ప్రస్తుతం ఆ నిబంధన పోవడంతో వారు సంతోషిస్తున్నారు. తమకు స్వేచ్ఛ వచ్చిందని సంబరపడుతున్నారు.
ఇన్నాళ్లు మొగుడు కొట్టినా తిట్టినా పడి ఉండేవాళ్లం. కానీ ప్రస్తుతం పరిస్థితిలో మార్పు రావడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అడిగిన వెంటనే విడాకులు ఇవ్వాలనే సుప్రీంకోర్టు తీర్పును వారు స్వాగతిస్తున్నారు. తమకు దొరికిన అద్భుత అవకాశంగా చెబుతున్నారు. ఇక మీదట భర్త వేధింపులు భరిచాల్సిన అవసరం లేదని అంటున్నారు. తమకు నచ్చలేదంటే తక్షణమే విడాకులు తీసుకునే వెసులుబాటు రావడం నిజంగా గర్వకారణంగానే భావిస్తున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో విడాకులు తీసుకునే వారు పండగ చేసుకుంటున్నారు. ఫొటో షూట్ లో పాల్గొని తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భర్తలు ఇక మీదట ఏదైనా చేస్తే విడాకులు తీసుకుంటాం జాగ్రత్త అని చెబుతున్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భర్తలకు ఆశనిపాతంగానే మారనుంది. మహిళా లోకానికి అండగా నిలిచే ఈ తీర్పుతో ఎన్ని జంటల్లో మంటలు రేగుతాయో చూడాల్సిందే.