Divorce : పెళ్లంటే నూరేళ్ల పంట. దీని కోసం ప్రతి ఒక్కరు ఎన్నో కలలు కంటారు. తన జీవితస్వామి విషయంలో ఎన్నో ఊహించుకుంటారు. కానీ పెళ్లి అవగానే వారి ఆశలన్ని ఆవిరైపోతే విడాకులే శరణ్యం అని భావిస్తారు. కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందంటారు. అలా కాపురాలు కలకాలం సాగించుకోవాల్సిన జంటలు మధ్యలోనే విడిపోతున్నారు. చిన్న విషయాలనే పెద్దవిగా భావించుకుని విడాకులు తీసుకుంటున్నారు.
పెళ్లి అనే రెండక్షరాల పవిత్ర బంధాన్ని చులకన చేస్తున్నారు. పాశ్చాత్యులు కూడా మన వివాహ వ్యవస్థను గౌరవిస్తుంటే మనమే దాని ప్రాధాన్యతను తగ్గిస్తున్నాం. ఇటీవల కాలంలో విడాకులు తీసుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. విడాకులు తీసుకునే వారు సెలబ్రిటీలే ఉంటున్నారు. వారి వ్యక్తిగత కారణాలతోనే విడిపోతున్నారు.
వెండితెర నుంచి బుల్లి తెర వరకు చాలా మంది విడాకులు తీసుకుంటూ మన వివాహ వ్యవస్థకు మచ్చ తెస్తున్నారు. పది కాలాల పాటు కలిసి ఉండాలనే కనీస ధర్మాన్ని త్యజిస్తున్నారు. వ్యక్తిగత జీవితాలను గౌరవించి విడాకుల వరకు వెళ్తున్నారు. ఫ్రెండ్స్, సపోర్టర్స్, కుటుంబసభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇదే ట్రెండ్ గా మారిపోతోంది.
ఇప్పుడు ఇదే బాటలో ఓ యూ ట్యూబర్ జంట వెళ్తోంది. విడాకులు తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసి ఇంటింటికి కూరగాయలు, పండ్లు అందించే జంట విడాకులు తీసుకోవాలని భావించింది. ఈ విషయాన్ని ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించింది. దీంతో ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎందుకు విడిపోవాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. నేత్ర, వంశీ పోస్టుపై ప్రేక్షకులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.