![MLA Gorantla](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-10-1.jpg)
MLA Gorantla : గతంలో తప్పులు చేసిన అధికారులను విడిచిపెట్టబోమని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు సీఎం చంద్రబాబు పెంచారని, సంక్షేమంపైనే కాకుండా అభివృద్ధి పైనా తమ ప్రభుత్వం దృష్టి పెడుతుందని తెలిపారు.
అన్న క్యాంటీన్లను కూడా తెరిపిస్తున్నామని ఆయన వెల్లడించారు. అలాగే, తప్పులు చేసిన అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో అధికారులు కనీసం ప్రొటోకాల్ పాటించలేదని, ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన భూ అక్రమాలపై విచారణ చేయిస్తామని బుచ్చయ్య చౌదరి తెలిపారు.