దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటారు. ఇది అక్షరాల నిజం చేసుకుంటోంది హీరోయిన్ శ్రీలీల. పెళ్లిసందడితో పరిచయమైన ఆమె తెలుగు తెరను శాసిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో 8 సినిమాలున్నాయంటే ఆమె ఎంత బిజీగా ఉందో తెలిసిపోతోంది. పైగా తన పారితోషికం కూడా పెంచేసిందట. ప్రస్తుతం రెండు కోట్ల వరకు తీసుకుంటోంది. ఈ లెక్కన ఇప్పుడు ఆమె దాదాపు రూ. 15 కోట్లు సంపాదించినట్లు చెబుతున్నారు. అనతి కాలంలోనే ఇంత భారీ మొత్తంలో డబ్బు సంపాదించడం గమనార్హం.
కన్నడకు చెందిన ఆమె తెలుగు తెర మీద ప్రస్తుతం పట్టు సాధించింది. పవన్ కల్యాణ్, మహేష్ బాబు లాంటి బడా స్టార్లతో కూడా జతకడుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్, గుంటూరు కారం సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. రష్మికను దాటుకుని తన హవా కొనసాగిస్తోంది. నితిన్ తో వక్కంతం వంశీ తీస్తున్న ఎక్ట్సా ఆర్డినరీ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. విజయ్ దేవరకొండతో ఓ సినిమాలో చేస్తోంది. బాలయ్యతో భగవంత్ కేసరిలో కీలక రోల్ పోషిస్తోంది.
ఆదికేశవ, స్కంద, అనగనగా ఒకరోజు లాంటి సినిమాల్లో శ్రీలీల బిజీగా మారింది. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 1.50 కోట్ల నుంచి 2 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది. 22 ఏళ్ల శ్రీలీల ఇప్పుడు తన సంపాదన అమాంతం పెంచుకుంది. మన పెద్దలు చెప్పినట్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఒకే సమయంలో పది సినిమాలు చేస్తోంది.
ఇంకా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో ఆమెను సంప్రదిస్తే రిజెక్టు చేసిందని సమాచారం. అలా పరిశ్రమలో శ్రీలీల హయాం కొనసాగుతోంది. పెద్ద హీరోలతో జతకడుతూ కొన్ని సినిమాలు వద్దనుకుంటోంది. ఇంత చిన్న వయసులోనే ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. శ్రీలీల తెలుగు సినిమా పరిశ్రమలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది.